ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని దొడ్డి కొమరయ్య భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుజ్జుల కొండ లు ఆధ్వర్యంలో  జెండా ఆవిష్కరణ చేసినంతరం సీనియర్ నాయకులు బండారి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా నాయకులు ఎస్.కె బషీర్  మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భావించినప్పటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా కార్మికుల పక్షాన నిలబడి రాజీలేని పోరాటాలు నిర్వహించిందని, అనేక మంది కార్మిక సంఘ నాయకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా సీఐటీయూ పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి బత్తుల గోవిందు ఎండి యూసుఫ్ ఆనంద్ పాల్, దాసరి హనుమంతు, రోశయ్య చంద్రశేఖర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love