9వ తరగతి విద్యార్థి అదృశ్యం

నవతెలంగాణ-కుల్కచర్ల
9వ తరగతి విద్యార్థి అదృశ్యమైన సంఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం బొంరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండు శ్యామలమ్మ భర్త దండు పుల్లయ్య కుమారుడు దండుసిద్ధార్థ (16) మండల కేంద్రంలోని చిన్న అంతారం గ్రామంలో తన సోదరి పద్మమ్మ వద్ద ఉండి పుట్టపహాడ్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్ళనని మారం చేయడంతో స్కూల్‌ కి వెళ్తే వెళ్ళు లేకపోతే మీ ఊరికి పో అని అనడంతో సరే అని చెప్పి ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. సాయంత్రం గడిచిన ఇంటికి రాకపోయేసరికి తల్లితండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. తల్లితండ్రులు వచ్చి చుట్టుపక్కల, బంధువుల వద్దకి వెళ్లాడని వెతికిన ఆచూకీ లభించలేదు. విద్యార్థి వాడిన సైకిల్‌ వాళ్ల సోదరి పొలం దగ్గర ఉన్నది. విద్యార్థి బయటకు వెళ్లిన సమయంలో బ్లాక్‌ కలర్‌ పాయింట్‌,రెడ్‌ కలర్‌ టీ షర్ట్‌ ధరించాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అన్వేష్‌ రెడ్డి తెలిపారు.

Spread the love