మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు

నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్​ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్​తో పాటు మంత్రులు తలసాని, ఇంద్రకరణ రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు.

Spread the love