నవతెలంగాణ – కట్టంగూర్
పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాస్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హంగర్ సర్వీస్ వీక్ లో భాగంగా బుధవారం న్యూట్రీషియన్ ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.విద్యార్థులు పాలు, పండ్లు కూరగాయలు, గుడ్లు నిత్యం తీసుకోవడంతో పాటు,మంచినీరు సరిపడా తాగాలని సూచించారు.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలన్నారు. తీసుకున్న ఆహారం శక్తిని ఇవ్వడంతో పాటు బుద్ధుని పెంచి రోగాల బారి నుంచి కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంబులింగారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్,ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు,లయన్స్ క్లబ్ సభ్యులు కడారి మల్లికార్జున్, మంగదుడ్ల శ్రీనివాస్, బొడ్డుపల్లి వెంకన్న ఉపాధ్యాయులు ఉన్నారు.



