డీఎస్ కు మున్నూరు కాపుల సంతాపం

నవతెలంగాణ – సిరిసిల్ల
మున్నూరు కాపుల ముద్దుబిడ్డ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషించాడని ఆయన క్రమశిక్షణ గల నాయకుడు అని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య అన్నారు. సిరిసిల్లలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో పట్టణ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య మాట్లాడుతూ.. డి.శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చేసిన సేవ ఎనలేనిదని, సీనియర్ రాజకీయ నాయకులుగా తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్ హక్ కమిటీ కన్వీనర్ అగ్గి రాములు, గౌరవ అధ్యక్షులు నీలి శంకర్, ఆకుల సత్యనారాయణ, పల్లికొండ నర్సయ్య, చొక్కి శ్రీనివాస్, లింగంపల్లి సతీష్, తోట శంకర్, దుమాల రవి, నాయిని కిషన్, కోడిమ్యాల వేణు, కుల్ల సత్తయ్య, ఇప్పపూల రాజు, కొట్టే శ్రీనివాస్, ల్యాగల బాగయ్య, ఇప్పపూల లక్ష్మణ్, బత్తుల భూమేష్, కూస లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love