చామలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు..

నవతెలంగాణ – తిరుమలగిరి 
నేడు జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులైన బీజేపీ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన క్యామ మల్లేష్ యాదవ్ లపై 2,22,249 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ మేరకు విజయ ఆనందంతో కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని తిరుమలగిరి మండల కాంగ్రెస్ నాయకులు మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జిమ్మిలాల్  వారిని మర్యాదపూర్వకంగా కలిసిప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love