- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై మంత్రి కొండా సురేఖ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ విధించిన 3 రోజుల షోకాజ్ నోటీసుల గడువు శనివారంతో ముగియనుంది. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చి, నోటీసు ఉపసంహరణ కోరారు. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు చేయగా, వచ్చిన వివరణలన్నింటినీ పరిశీలించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
- Advertisement -



