Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయండీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తమిళనాడులో కాంగ్రెస్ ఆందోళన

డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తమిళనాడులో కాంగ్రెస్ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: డీలిమిటేషన్(పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన)ను వ్యతిరేకిస్తూ ఆదివారం తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో కాంగ్రెస్ భారీ ఆందోళన చేపట్టింది. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన తమిళనాడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా.. కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల బెలూన్లను విడుదల చేస్తూ, “మోదీ-పరిమితిని తిరస్కరించండి” వంటి నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ర్యాలీకి తిరుపత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విజయ్ ఇళంచెళియన్ నాయకత్వం వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -