- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివారం మండలంలోని కొయ్యూర్ గ్రామంలో ఆదివాసీ నాయకులు జెండాను ఎగరవేసి, కొమరం భీం విగ్రహానికి పూలమాలతో అలంకరించి ఆదివాసి గిరిజనుల నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టం భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి రమేష్, సంఘం సీనియర్ నాయకులు గడ్డం లచ్చయ్య, గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ తోపాటు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు,ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



