రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి..

The spirit of the Constitution should be maintained.– మార్కెట్ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్.
నవతెలంగాణ – సారంగపూర్
మహాత్మా గాంధీ,అబేడ్కర్ ,రాజ్యాంగ స్ఫూర్తి ని కొనసాగించాలని పోగ్రామ్ ఇంచార్జీ భైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ అన్నారు. మంగళవారం మండలంలోని చించోలి(బి),గోపాల్ పెట్, సోనాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు,జై బీమ్,జై సంవిధాన్ కార్యక్రమానికి హాజరై మహాత్మ గాంధీ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగాడుతూ బిజెపి అనుసరిస్తున్న వైఖరినీ ప్రజలకు వివరిస్తూ.. జై బాపు జై బీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం స్వతంత్రం వచ్చినా నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హది,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు  దశరథ రాజేశ్వర్,కిసాన్ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ పోతారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి,నాయకులు నారాయణరెడ్డి,వెంకటరమణారెడ్డి, నవీన్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మధుకర్, సత్యం,సత్యపాల్ రెడ్డి, చందు, సురేందర్, బోజన్న, సలీం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love