సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ గెలుపు కోసం గురువారం మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలం నందీశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పలు రాజకీయ పార్టీల నాయకులు రంగులు మార్చుకొని ఓట్లు అడగటానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. డబ్బు మూటలు తీసుకొని గ్రామాలలో ఓటర్లను డబ్బులతో కొనాలనే ఆలోచనలతో మన ముందుకు వస్తున్నారని నందీశ్వర్ అన్నారు. వాళ్లకు ప్రజలు ప్రజాతంత్ర వాదులు బుద్ధి చెప్పాలని,నిత్యం మన కోసం పనిచేసే నాయకుడు కావాలి. ప్రజా సమస్యలే పోరాటం చేసే ప్రజల శ్రేయస్సు కోరే అభ్యర్థి కామ్రేడ్ జాంగీర్ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. భారత పరిరక్షణ కోసం దేశ ఆర్థిక స్వాలంబన కోసం మన హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం జరిగే కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజా ఉద్యమాలు నడిపిస్తున్న అలుపెరిగిన పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు జాంగీర్ ని గెలిపించాలని ఆదిమూలం నందీశ్వర్ చెప్పారు. గతంలో మూసి ప్రక్షాళన చేయాలని పాదయాత్ర చేసినటువంటి గొప్ప నాయకుడు జాంగీర్. ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధిక ధరలు పెంచుతూ గతంలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా మళ్లీ కొత్త మేనిఫెస్టో పెట్టి మత కల్లోలాలను సృష్టించి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వన్ని ఓడించాలని,పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పార్టీల నాయకులను ఓడించాలని ఆయన చెప్పారు. కార్మికులు కర్షకుల ప్రజా సమస్యల ఎజెండాగా ప్రజా పోరాట నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జాంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని నందీశ్వర అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతల సుదర్శన్, ఎస్ కే ఇబ్రహీం,బక్క బొందయ్య, కొంతం కృష్ణారెడ్డి,ఎలకరాజు సుధాకర్,ఎస్కే రజియా,ఎస్.కె ఫర్హానా,పగడాల భిక్షం,బక్క యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love