తీన్మార్ మల్లన్న గెలుపుకు కృషి చేయాలి: దేశెట్టి చంద్రశేఖర్ 

నవతెలంగాణ – బొమ్మలరామారం
ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీ సాధిస్తారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయం చేసి ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగులకు కల్పించే ఉద్యోగ భృతిని తెలియజేసి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Spread the love