నవతెలంగాణ – వాంకిడి
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోవలక్ష్మి 76మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంకా మండలంలో చాలా మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు రావాల్సి ఉందని, వారికి కూడా త్వరలోనే చెక్కులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విమలాబాయి, జెడ్పీటీసీ అజరుకుమార్, మాజీ సర్పంచ్ తుకారాం, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్ పాల్గొన్నారు.