స్కూల్ బ్యాగులు, ప్లేట్స్, పలకలు పంపిణీ 

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం కాచారం గురువారం అజయ్ మెమోరియల్ ఫౌండేషన్  వారి ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూలు, అంగన్వాడి స్కూల్ విద్యార్థులకు అజయ్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో స్కూల్ బ్యాగులు, ప్లేట్స్, పలకలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వారు మాట్లాడుతూ.. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ సభ్యులకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు. ఇంక ముందు జరగబోయే కార్యక్రమాలకు ఇదేవిధంగా సభ్యుల సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు స్కూల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love