నవతెలంగాణ – దుబ్బాక రూరల్
విద్యార్థులు ఇష్టపడి చదువుకొని ఉన్నతంగా ఎదగాలని, గంజాయి ఇతర మత్తు పదార్థాల జోలికెళ్ళద్దని దుబ్బాక ఎస్ఐ వి.గంగరాజు అన్నారు. శనివారం దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ పనితీరు గంజాయి ఇతర మత్తు పదార్ధాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాలు వాడకం, మహిళల రక్షణ, షీ టీమ్స్ పనితీరు వంటి అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందన్నారు. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. మహిళల భద్రత తమ ముఖ్య బాధ్యత అని అన్నారు. చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావొద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్ధాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ద వహించాలన్నారు. సామాజిక రుగ్మతల గురించి ఎవరైనా పిల్లలను మహిళలను వేధించినట్లయితే వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. కాల్ చేసిన వారి పేర్లు వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. అలాగే చదువుపై దృష్టి పెట్టి 10 జిపిఏ సాధించిన విద్యార్థులకు పోలీస్ శాఖ తరపున ఘనంగా సన్మానించి రివార్డు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ నర్సవ్వ, అధ్యాపకులు, సిద్దిపేట షీటీమ్ బృందం కిషన్, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు మమత, వీణకుమారి, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.