కోఠి ఈఎన్ టీ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ఉపయోగపడే పరికరాలు విరాళం..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
కోఠి ఈ ఎన్ టి ప్రభుత్వ ఆసుపత్రి లో గురువారం ఎబిఎన్ రావు ఆడిటోరియంలో ఎన్ టి పి సి సౌత్ రీజియన్ హెడ్ క్వార్టర్ జనరల్ మేనేజర్ సూర్యనారాయణ పాణిగ్రహి, డీజీఎం బద్రుద్దీన్ అన్సారి, మేనేజర్ ప్రియాంక తదితరులు 9.47 లక్షల విలువచేసే పేద రోగుల సౌకర్యార్థం ఉపయోగపడే పరికరాలను విరాళంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ కు అందజేశారు. అనంతరం  సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వారికి పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కూడా ఆసుపత్రికి అవసరమైన సయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ఆర్ ఎం ఓ పి డాక్టర్ జయ మనోహరి ,ప్రొఫెసర్ అండ్ హెచ్ ఓ డి డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, డాక్టర్ కె వి ఎన్ దుర్గాప్రసాద్, డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, ప్రొఫెసర్ అండ్ అనస్తీసియా డాక్టర్ కే ఉమా,  డాక్టర్ వీణ, నర్సింగ్ ఆఫీసర్స్ స్వర్ణలత, పుష్పాలత, కేజియా, మాధవి, సరిత, మరియ, రవి, మధు, రజిని, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Spread the love