
– హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : యువత తాత్కాలిక ఆనందం కోసం గంజాయి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణం ,పరిసర ప్రాంతాల్లో కిరాణా షాపులు, బేకరీ, టీకొట్లు, పాన్ డబ్బాతో పాటు అనుమానాస్పద ప్రదేశాలలో నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. గంజాయి రహిత జిల్లా చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్,1908 లేదా హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.