వీరేశంను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

నవ తెలంగాణ-నకిరేకల్ 
మండలంలోని చందంపల్లి గ్రామంలో ఎంపీపీ బచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశమును గెలిపించాలని కోరుతూ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం తోనే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉచిత కరెంటు పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిఆర్ఎస్ పదేండ్ల కాలంలో రాష్ట్రం ఐదు లక్షల  కోట్లు అప్పులోకి కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులతో చేసిన అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love