నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా డా.హిప్నో పద్మా కమలాకర్

నవతెలంగాణ-హైదరాబాద్ : నవభారత లయన్స్ క్లబ్ 2024- 25కు ఏకగ్రీవంగా నన్ను క్లబ్ అధ్యక్షురాలిగా నన్ను ప్రధాన కార్యదర్శి బి.వాణి వినయ్, కోశాధికారి గీతను ఎన్నుకునందుకు320A జిల్లా గవర్నర్ డా. డి. కోటేశ్వరరావు, డా. మహేంద్ర కుమార్ రెడ్డి, యాదయ్య గౌడ,జోనల్ చైర్ పర్సన్ గోపాల్ కృష్ణ, బి.వినయ,జే.టి.విద్యాసాగర్, రామ్ ప్రసాద్, సుబ్బారావు , డా.పి.స్వరూపా రాణి ,లయన్ జి.కృష్ణ వేణి,కు డా.హిప్నో పద్మా కమలాకర్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల హోటల్ అబోడ్, లక్డీ-కా-పూల్, హైదరాబాద్ లో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ మీటీంగ్ లో ఎన్నుకోవడం జరిగిందన్నారు.
డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో పత్రికా విలేఖరులతో మాట్లాడారు. నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు, స్కూల్లో, అనాధ విద్యార్థులు గృహంలో, స్లం ఏరియాలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రెస్ సపోర్ట్ తో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. వారి సహకారం ఎప్పుడూ ఇలానే కొనసాగాలని కోరారు. నూతన కమిటీ సభ్యులు కూడా మరిన్ని కార్యక్రమాలకు సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.

Spread the love