జాతీయ వైద్యరత్న అవార్డుకు ఎంపికైన డాక్టర్ శంకర్ నాయక్

– నిరంతర వైద్యం.. నిరుపేదలకు సేవే లక్ష్యంగా..
– లక్ష్మి విజయా పౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు..
– గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
– పూణే లో జాతీయ వైద్య రత్న అవార్డు అందుకున్న శంకర్ నాయక్
నవతెలంగాణ – పెద్దవూర
పేదింటి గిరిజన బిడ్డలు కష్టపడి చదివి వైద్య విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసం అనంతరం సంపాదనను వెతుక్కుంటూ కార్పొరేట్ వైద్య ప్రపంచం వైపు వెళ్లలేదు. తమ భావాలు మర్చి పోకుండా గ్రామీణ బాట పట్టారు. విజయ, శంకర్ నాయక్ దంపతులు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకు డుచెట్టుతండాకు వ్యవసాయ కుటుంబం రమావత్ భిక్షనాయక్, కమిలీ కుమారుడు శంకర్ నాయక్. పేదకుటుంబం కావడం తో చిన్నప్పటి నుంచి చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థలల్లోనే కొనసాగింది. తండ్రి కాయ కష్టం చేస్తూ తన కుమారున్ని కష్టపడి మెడిసిన్ పూర్తి చేయించారు.ప్రభుత్వ వైద్యాధికారులుగా నియమితులై సేవలందిస్తూనే నిరుపేదలకు అందు బాటులో ఉండేవిధంగా అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా దేవర కొండ, హాలియాలో లక్ష్మి విజయపౌండేశన్ స్థాపించి సేవా కార్యాక్రమాలు చేపడుతున్నారు.ప్రస్తుతం దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో సివిల్ ఆసిసిస్టెంట్ సర్జర్ గా పనిచేస్తున్నారు.అతని సతీమణి విజయ చందంపేట మెడికల్ ఆఫీసర్ గా సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ విశ్రాంతి లేకుండా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మారు మూల ప్రాంతాల్లో నివసించే పేదలు, గిరిజనులకు 24 గంటల పాటు వైద్యసే వలు అందింస్తున్నారు.
జాతీయ వైద్యరత్న అవార్దుకు ఎంపిక:
డాక్టర్ శంకర నాయక్ అందిస్తున్న వైద్య సేవలు, పేదలకు సేవ చేస్తూ తనకున్న దాంట్లో ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన బహుజన సాహితి అకాడమీ వారు జాతీయ వైద్య రత్న అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహితి అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ మరియు బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు అహ్వాన పత్రాన్ని హైదరాబాద్లో బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. వైద్య వృత్తిలో ఉంటూ సమాజీ సేవా కార్య క్రమాలతో పాటు గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నందుకు డాక్టర్ శంకర్ నాయక్ సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారు సోమవారం నాడు పశ్చిమ భారత బహుజన రచయితల జాతీయ సదస్సులో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ గోవా రాష్ట్రాలు అనుసంధానంతో మహారాష్ట్రలోని పూణే పట్టణంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ సాంస్కృతిక భవనంలో నల్ల రాధాకృష్ణ జాతీయ అధ్యక్షులు చేతుల మీదుగా జాతీయ వైద్యరత్న అవార్డు 2024 ను జూన్ 10 న అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే ప్రముఖులు జాతీయస్థాయి బహుజన సాహిత్య అకాడమీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ అవార్డు తీసుకున్నా అనంతరం డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ బహుజన సాహిత్య అకాడమీ వారు తమ సేవలను గుర్తించి జాతీయస్థాయిలో 2024 సంవత్సరాలు గాను జాతీయ వైద్యరత్న అవార్డు చ్చినందుకు సంతోషంగా ఉందని వారన్నారు. ఈ ఆవార్డుతో నా వైద్య వృత్తిలో మరింత బాధ్యత పెరిగిందని గ్రామస్థాయిలోనే కాకుండా చిన్న చిన్న తండాలలో కూడా సేవలను మరింత విస్తరింపజేయాలని వారికి ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించాలని అవసరం ఉందని వారన్నారు. ఈ అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవాకా ర్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Spread the love