డ్రయినేజీ సమస్య తలెత్తకుండా చూడాలి

– ఎమ్మెల్యే బలాల
నవతెలంగాణ-మలక్‌పేట్‌
వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రయినేజీ సమస్య తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల అన్నారు. మలక్‌పేట్‌ నియోజక వర్గంలోని సాయినగర్‌ ముషారంబాగ్‌లో అధికారులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా డ్రయినేజీ, రహదారులు తదితర సమస్యలున్న ప్రాంతాలను గుర్తించారు. అధిక వర్షాలు కురుస్తున్నాయని..రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు డ్రయినేజీలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించాలన్నారు. వర్షాలు కురిసినప్పుడు తాగు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో జీహెచ్‌ఎంసీ అధికారులు, హెచ్‌ఎండబ్లూఎస్‌ఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love