కోనసముందర్ లో డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని కొన సముందర్ గ్రామంలో బుధవారం డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. విద్యార్థుల నినాదాలతో కొనసాగిన ఈ ర్యాలీ గ్రామ ప్రధాన కూడలి వద్దకు చేరుకోగానే అక్కడ మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ మాట్లాడుతూ..  డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు.యువత మాదక దవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడినవారు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిల్లో అఘైత్యాలకు  పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు రమేష్, దేవదాస్, నరేష్, జ్ఞానేశ్వర్, సంతోష్, రమేష్ బాబు, నర్సారెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love