అహ్మదాబాద్‌లో విద్యార్ధుల లంచ్ బాక్స్‌లో డ్రగ్స్ కలకలం..

నవతెలంగాణ-హైదరాబాద్ : చిన్న పిల్లల లంచ్ బాక్స్‌లో డ్రగ్స్‌ను సర్ఫరా చేసేందుకు యత్నించిన స్మగ్లర్‌ను అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో క్రైమ్ బ్రాంచ్‌తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు శనివారం సంయుక్త ఆపరేషన్‌‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌‌‌లో చిన్నారుల బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లలో డ్రగ్స్‌ను గుర్తించారు. కాగా ఆ విలువ రూ. 1.15 కోట్లు అని అధికారులు తెలిపారు. కాగా ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love