అక్రమ అరెస్టులతో పోరాటాలను ఉద్యమాలను ఆపలేరని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గినేని భాను అన్నారు. శుక్రవారం మండలానికి చెందిన బీజేవైఎం & ఏబీవీపీ నాయకులను శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ అక్రమ అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదనీ, ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న బీజేవైఎం మండల అధ్యక్షులు కన్నీకంటి శ్రీకాంత్ చారి, అశోక్ & ఏబీవీపీ సీనియర్ నాయకులు మెరుగు మణికంఠ తదితరులను అక్రమ అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పాలనకు నిదర్శనం. ప్రజలందరు చూస్తూనే ఉన్నారు. ఏవి అయితే హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చారో అన్ని నెరవేర్చాలి లేనియెడల ప్రజ ఆగ్రాహానికి గురి కాక తప్పదు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ లు లేక ఎంతో మంది యువతీ యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల కోసం 25000 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని, గ్రూప్ 2మరియు గ్రూప్ 3లో ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ లు వేయాలని, జాబ్ నోటిఫికేషన్ వేయాలని బీజేవైఎం & ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. ఎక్కడ కూడా ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. బీజేవైఎం నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుంది. స్థానిక మంత్రి అయినా సీతక్క ఇప్పటికైనా ఇక్కడి నిరుద్యోగుల కోసం జీ. వో. 317 మరియు 46 ని తీసివేయించి స్థానికేతరులని పంపించి ఇక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నమన్నరు.