Sunday, August 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఈజిప్ట్‌లో భూకంపం..

ఈజిప్ట్‌లో భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఈజిప్ట్ తీరానికి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూకంపం ప్రభావం కనిపించిన చోట అత్యవసర సహాయ బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం నమోదుకాలేదని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -