జార్ఖండ్‌ సీఎంకు ఆరోసారి ఈడీ నోటీసులు

రాంచీ: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు (CM Hemant Soren) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్‌ (Money Laundering) జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్‌ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్‌ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు తెలిపారు.

Spread the love