నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆప్ పార్టీకి చెందిన ప్రధాన నాయకులను అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంటిపై దాడిచేసింది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం అరెస్టయిన కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు వారం రోజులు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.