కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలి

– ప్రతిజ్ఞ చేయిస్తున్న సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు
నవతెలంగాణ – రామగిరి 
కుష్టి వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రపంచ  కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం ఏర్పాటు చేసారు. కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పెండ్లి రమ్య, ఎంఎల్ హెచ్ పీ కర్రావుల. నవ్యశ్రీ, వార్డ్ సభ్యులు బొంగురాల రవి, కారోబార్ కొండపర్తి శ్రీనివాస్, ఏ.ఎన్.ఎం అంగూరి.విజయ లక్ష్మి, గడ్డం సునీత,మేడ స్వరూప,పంజా సంపత్,పోస్టు మాస్టర్ వెంకన్న, జక్కుల ఆశాలు అంగూరి రమేష్, గుండ రాధయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love