నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా డి. వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శిగా జి.కపాకర్రెడ్డిలు ఎన్నికైయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వ్యవసాయ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 244 ఓట్లు పోల్ కాగా వైద్యనాథ్కు 153, రవీంద్రనాథ్రెడ్డికి 91 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శిగా జి. కపాకర్ రెడ్డికి 209 ఓట్లు రాగా, నదీముద్దీన్కు 34 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికా రులు అధ్యక్షులుగా డి. వైద్యనాధ్, ప్రధాన కార్యదర్శిగా జి. కపాకర్ రెడ్డిలు ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం అసోసియేట్ అధ్యక్షులుగా కాంతారావు, ఉపాధ్యక్షులుగా శైలజరెడ్డి, వీణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా నాగమ్మ, సుధాకర్రావు, పబ్లిసిటీ కార్యదర్శిగా మానసా, కోశాధికారిగా రవీందర్, కల్చరల్ సెక్రటరీగా శ్రీనివాస్లు ఎన్నికైయ్యారు. ఎన్నికల అధికారులుగా జెడిఏలుగా రిటైర్డ్ అయిన ఆనంద్రెడ్డి, కష్ణారెడ్డి, రామచంద్రరావు, రామకష్ణకళ్యాణ్, చంద్రశేఖ ర్లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మెన్ బి.కపాకర్రెడ్డి, వైస్ చైర్మెన్ అనురాధా, ప్రత్యేక ఆహ్వాని తులు చంద్రమోహన్లు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వైద్యనాధ్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సంక్షేమం కోసం తన శక్తివంచన లేకుండా కషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలిపారు.