రెడ్డి సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక 

నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని మేడారం, ఊరట్టం, కాల్వపల్లి గ్రామపంచాయతీల నూతన రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జంగా వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్నం రామిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా దొంతి జైపాల్ రెడ్డి కోశాధికారిగా వీరెల్లి సంపత్ రెడ్డి గౌరవాధ్యక్షులుగా అనంతరెడ్డి, సభ్యులు చిర్ర సంజీవరెడ్డి వీరెల్లి మురళి రెడ్డి సారంపల్లి రాజిరెడ్డి కడారి మహేందర్ రెడ్డి లను ఇకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు జంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గంలోని పేదవారి కోసం సంక్షేమ పథకాల అమలు కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love