కేజీబీవీలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు..

– కస్తూర్బాను సందర్శించిన డిఎల్ పిఓ  శివరామకృష్ణ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేజీబీవీ విద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరు శుక్రవారం సాయంత్రం పాము కాటుకు గురైనట్లు ఆలస్యంగా తెలిసింది. ఏ విషయాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్ కు   ప్రిన్సిపల్ గంగామణి శనివారం సమాచారం ఇవ్వడంతో స్పందించిన ఆయన వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందితో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో  పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు. విద్యాలయంలో సిబ్బంది ఒకరు పాముకాటుకు గురైన సమాచారం తెలిసి ఆర్మూర్ డివిజనల్ పంచాయతీ అధికారి శివరామకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించారు. పాము కాటుకు గురైన సిబ్బంది చికిత్స పొందుతుందని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రత్యేక అధికారిణి గంగామణి తెలిపారు.
Spread the love