విద్యార్థులకు వ్యాసరచన పోటీలు..

నవతెలంగాణ-బెజ్జంకి : మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మండలలోని  కల్లెపల్లి,బెజ్జంకి ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల ప్రజలకు జరిగే నష్టాల అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించారు.మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని పోలీసులు తెలిపారు.నేడు విద్యార్థులచే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ కృష్ణా రెడ్డి తెలిపారు.
Spread the love