నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

నవతెలంగాణ – మిరుదొడ్డి 
మిరుదొడ్డి మండల కేంద్రంలో నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్గనైజేషన్ చైర్మన్ ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేసవికాలంలో పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అను వాటర్ ప్లాంట్ సౌజన్యంతో వర్షాకాలం వరకు చలివేంద్రాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. వేసవి కాలంలో వివిధ గ్రామాల నుండి మిరుదొడ్డి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బైరయ్య, రమేష్, చందు, రాజయ్య, పర్శ రాములు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love