హక్కులపట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రజలు హక్కులపట్ల ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జంగారెడ్డిపల్లెలోని ఎస్సీ కమ్యూనిటీహాలులో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భముగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పౌర స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, ఆర్ధిక రాజకీయ,సామాజిక స్వేచ్ఛల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం ప్రసాదించిన కుల, మత,వర్గ, లింగ బేధాలు లేకుండా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివరాత్రి ఎల్లమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోహర్ , వార్డు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love