రసాయన పరిశ్రమలో పేలుడు.. తప్పిన పెను ప్రమాదం

నవతెలగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో వరుస పేలుడు ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం షాద్‌నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృత్యువాత పడిన ఘటనను మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడతో ప్యాక్టరీ యాజమాన్యం, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే పరిశ్రమ ప్రాంగణం ఆవరణలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Spread the love