ఈ పాస్ మిషన్ల ద్వారానే ఎరువులు విక్రయించాలి

– జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి
నవతెలంగాణ – రామగిరి 
జిల్లాలోని ఎరువుల దుకాణాలలో ఈపాస్ మిషన్ల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి సూచించారు. రామగిరి మండలంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఎరువుల దుకాణాల లైసెన్సులు, ఎరువుల స్టాక్ పుస్తకాలు, ఈ పాస్ మెషిన్లలో ఉన్న స్టాక్ లను పరిశీలించారు. ఎరువుల విక్రయాలను కేవలం ఈ పాస్ మిషన్ల ద్వారానే నిర్వహించాలని డీలర్లను ఆదేశించారు. రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వంటకు అవసరమైన మోతాదులోనే యూరియా లేదా ఇతర ఎరువులు వాడాలని, అవసరానికి మించి ఎరువులు వాడితే నేల కాలుష్యం జరిగి భవిష్యత్తులోనేల వంటల సాగుకు పనికి రాకుండా తయారయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భూక్య మోహన్ పాల్గొన్నారు.
Spread the love