పేదింటి అమ్మాయికి ఆర్థిక సహాయం..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ అర్బన్ మండలం సంకపెల్లి గ్రామానికి చెందిన పేదింటి అమ్మాయి రెడ్డవేని సంధ్యారాణి వివాహం ఆదివారం రోజున జరగనున్న సందర్భంగా దాతల నుండి విరాళాలు సేకరించి శనివారం రోజున అమ్మాయి తల్లిదండ్రులు రెడ్డవేని గౌతమి శ్రీనివాసుకు 7500 రూపాయల నగదు, 50కిలోల బియ్యం, పట్టుచీర, పసుపుచీర పసుపు కుంకుమ,గాజులు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. పెళ్లికూతురు తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మా అమ్మాయి పెళ్లికి తోబుట్టువుల్లా సాయం అందించిన దాతలను మేము జీవితంలో మరువలేమని, వారికి రుణపడి ఉంటామని సహకారం అందించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బెజ్జంకి రవీందర్, పొలాస రాజేందర్, చల్ల సత్తయ్య, వీరగోని అంజయ్య గౌడ్, సంకపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love