రైతు కుటుంబానికి ఆర్థిక సాయం 

నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం అంకొల్ తండా కు చెందిన మలోత్ హరి ప్రమాదవశత్తు నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. నసురుల్లాబాద్ మండలం దుర్కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం ఉండడంతో ప్రధానమంత్రి కిసాన్ బీమా యోజన పథకం కింద ఒక్క లక్ష రూపాయల బీమా డబ్బులు మంజూరు కావడంతో శుక్రవారం  దుర్కి సహకార సంఘంలో సంఘం చైర్మన్ డివిటి శ్రీనివాస్ యాదవ్ మృతుని కుటుంబ సభ్యులకు  చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ డిప్యూటీ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని అలాగే సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులందరికీ పిఎం కిసాన్ యోజన పథకం వర్తించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాములు మిద్దెల , బి. శ్రీనివాస్, మరియు బ్యాంక్ మేనేజర్ సందీప్,  అసిస్టెంట్ మేనేజర్ భూమేష్, సొసైటి కార్యదర్శి డి. గంగారం, సొసైటి సిబ్బంది తదతరులు ఉన్నారు.
Spread the love