- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



