కవ్వాల్ టైగర్ జోన్ లోని సమస్యలను పరిష్కరించండి..

Solve the problems in the Qawwal Tiger Zone..– ఫారెస్ట్ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు 
– 3 ఫేస్ కరెంటు ఆటంకాలు తొలిగించండి
– డిగ్రీ అథితి అధ్యాపకులకు 12నెలల జీతం ఇవ్వాలి 
– అభివృద్ధి పనుల కోసం వాడే ఇసుకకు అనుమతులు ఇప్పించాలి 
– అసెంబ్లీలో నియోవకవర్గ సమస్యలపై గళమెత్తిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్  
 నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్లో ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని,తక్షణమే అభివృద్ధి పనులు జరిగేలా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఖానాపూర్  ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.శనివారం శాసన సభలో ఖానాపూర్ నియోజకవర్గంలోని సమస్యలపై గళమెత్తారు. పారెస్ట్ ప్రాంతాల్లోని గ్రామాల్లో 3ఫేస్ కరెంటు అందించడానికి అధికారులు అడ్డుకుంటున్నారని, కడెం మండలంలోని గంగపూర్ పరిసర ప్రాంతాలలో 3ఫేస్ కరెంటు ఏర్పాటు చేస్తే ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామ ప్రజలను కార్యాలయాలకు పిల్చి ఇబ్బందులకు గురి చేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. జన్నారం మండలంలో ఉన్న తపాలాపూర్ చెక్ పోస్ట్ ఇన్నంపల్లి చెక్ పోస్ట్, కలమడుగు చెక్పోస్ట్ ల వద్ద అటవీ అధికారులు, సీ పీస్  పేరుట వసూలు చేస్తున్న వసూళ్లను ఆపాలన్నారు. మండలంలోని దేవుని గుడా గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డం గు డా  గిరిజనులపై  దాడులు చేస్తున్న   అటవీ శాఖ అధికారుల ఆగడాలను ఆపాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని ఫారెస్ట్ సమస్యల కారణంగా ఆటంకం కలుగుతుందని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.దస్తురాబాద్ మండలంలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని,అటవీ శాఖ మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదిలాబాద్,మంచిర్యాల,నిర్మల్ ఫారెస్ట్ అధికారులు ఆదేశాలు జారీచేసి అభివృద్ధి సక్రమంగా జరగడానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు 12 నెలల జీతం ఇవ్వాలని, వాటినే ఆటో రేనివల్ పద్ధతిలో ఎంపిక చేసుకోవాలన్నారు.
Spread the love