ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ నేత

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
హైదరాబాదులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం డీసీసీబీ మాజీ డైరెక్టర్ నేలపట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షులు పిల్లలమర్రి శ్రీనివాస్ నేత కలిసి వితపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న చేనేత సమస్యలపై చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించ వలసిందిగా, చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ చేయవలసిందిగా చేనేత కార్మికులకు నూలు సబ్సిడీ, త్రిప్టు స్కీం పునరుద్ధరించవలసిందిగా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. భువనగిరి ఎంపీ ఎన్నికల గురించి సీఎం గారు భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని 7 నియోజకవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం మందుల సామెల్  కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీర్ల ఐలయ్య మాల్ రెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దండెం సంజీవరెడ్డి శంకర్ నాయక్ చౌటుప్పల్ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ చిన్నగొని అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love