పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన క్లాసులు

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ కళాశాల సమీపంలోని మైత్రి అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు వివిధ పోటీ పరీక్షలపై  ఉచిత అవగాహన క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్లు   పాముల అశోక్, వంటల రాకేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మారుతున్న పోటీ పరీక్షల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం చే అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జూన్ 30 నుండి జూలై 2  జీకే కరెంట్ అఫైర్స్  సబ్జెక్టును అద్భుతంగా బోధించగల  జీకే మధు  క్లాసులు  నిర్వహించబడతాయని తెలిపారు. కావున ఈ సదావకాశాన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాల కోసం 9063686368,9052888852 సంప్రదించాలని తెలిపారు.
Spread the love