– డీసీపీ కే.సురేష్ కుమార్
– జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందించాలని బాలానగర్ జోన్ నూతన బాధ్యతలు స్వీకరించిన డిసిపి కే.సురేష్ కుమార్ పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం సైబరాబాద్ కమిషనరేట్,బాలనగర్ జోన్ పరిధి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ను ఏసీపీ.హనుమంతరావు సీఐ కే. క్రాంతి కుమార్తో కలిసి సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలు పోలీస్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఒక్కరికి మెరుగైన సేవలు అందించి, వారికి తగిన న్యాయం చేసే విధంగా సిబ్బంది సహకరించాలని సూచించారు. ఫిర్యాదులు తొందరగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, ఏఎస్ఐ,లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.