- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: నేడు సాయంత్రం నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. పంజాగుట్టలో సాయంత్రం 4 గంటలకు నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న నాదెండ్ల భాస్కర్ రావు, పరిస్థితి విషమించడంతో మరణించారు.
- Advertisement -



