గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో  గెలిపించాలి

– శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు కోరారు.శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున మంథని నియోజకవర్గంలో కాటారం,పలిమేల మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ, తెలంగాణ తల్లి సోనియమ్మ ప్రవేశ పెట్టిన ఐదు న్యాయ్ గ్యారంటీలను వివరిస్తూ కరపత్రాన్ని అందించి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలుపించాలని అభ్యర్థిoచారు.-అనంతరం పలువురు బిఆర్ఎస్ పార్టీ నుండీ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి శ్రీనుబాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love