గోడం నగేష్‌ను గెలిపించాలి

నవతెలంగాణ-కౌటాల
ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్‌ను ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని జగదాంబ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన అన్నారు. మూడోసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గోడం నగేష్‌ను కమలం పువ్వుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్రంకు పంపిస్తే జోడెద్దులుగా పనిచేస్తామని అన్నారు. కేంద్రం నుండి రూ. 1825 కోట్లు తీసుకొచ్చి సిర్పూర్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. బెల్లంపల్లి నుండి గడ్చిరోలి వరకు రూ.మూడు వేల కోట్లతో నాలుగు లైన్ల రహదారి నిర్మించనున్నట్టు, అలాగే తాటిపెల్లిలో రైతులు మిర్చీ పంట వేసి కరెంటు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్‌ వచ్చాకే కరెంటు పోయిందన్నారు. ఇదే విషయంపై సీఎండీతో మాట్లాడి నదీ పరివాహక ప్రాంతాల గుండా ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంగ సత్యనారాయణ, దోని శ్రీశైలం, కొప్పుల శంకర్‌, కన్నెపెల్లి ఎంపీటీసీ దుర్గం మోతిరాం. బండి రాజేందర్‌గౌడ్‌, తాళ్లపెల్లి తిరుపతిగౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love