- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు.
- Advertisement -



