చెత్త పాలన పోయి.. చంద్రన్న పాలన వచ్చింది

– టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి
– కూటమి గెలుపుతో మండలంలో సంబరాలు 

నవతెలంగాణ – పెద్దవంగర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ చెత్త పాలన పోయి చంద్రన్న పాలన వచ్చిందని టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి అన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీ లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బిక్షపతి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ తోనే రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా పాలన అందించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై కక్ష గట్టి, ప్రతి అంశంలోను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వైసీపీ అరాచకాలకు విసుగు చెంది ప్రజలు ఈ ఎన్నికలలో కూటమి కి భారీ విజయాన్ని అందించారని తెలిపారు. కార్యక్రమంలో సోమ వీరన్న, తాడిశెట్టి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పాశం యాకయ్య, బైన మనోజ్ సాగర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పెద్ది అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love