నవతెలంగాణ – సింగపూర్: ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో తన సిబ్బందికి బంపర్ ఆఫర్ అందించాలని నిర్ణయించింది. ఎనిమిది నెలల జీతాన్ని బోనస్గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా అన్ని ఎయిర్లైన్ సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించి.. చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ దేశాల సరిహద్దులు పూర్తిగా తెరచుకోవడమే తిరిగి సంస్థ లాభాల బాట పట్టడానికి కారణం అని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ ఉద్యోగులకు ఈ తీపి కబురును తెలియజేసింది.