నవతెలంగాణ – అమరావతి : టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుంటే.. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా విజయవాడ వెళ్లిన గోపీచంద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోపీచంద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్కి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో గోపీచంద్కు స్వాగతం పలికారు.